Tuesday, March 8, 2011

అనగనగా ఓ బస్తీ [ బాంద్రా ( ఈస్ట్ ) , గరీభ్ వాడ, ముంబై

Dt: 07-March-2011,
Day : Monday  Time: 8.30 PM

 
నిన్న రాత్రి  పదిన్నరకి కొల్హాపూర్ లో స్టార్ట్ అయిన బస్సు ఉదయం అయిదు గంటలకల్లా ముంబయి సిటీ దరిదాపుల్లోకి చేరుకుంది .
నేను దిగాల్సిన స్టాప్ ( దాదర్ ) వద్దుల్లోకి టైం ఆరు అయ్యింది. ఎప్పట్లాగే లాడ్జ్ లో ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకున్నాను .
క్లైంట్ కి అందించాల్సిన పేపర్స్ ఫైలింగ్ చేసి పదిన్నర ఆప్రాంతం లో లాడ్జ్  నుంచి బయలుదేరాను. టాక్సీ ఒకదాన్ని పట్టుకుని బాంద్రా ఈస్ట్ లో ఉన్న క్లయింట్  ( M.S.E.D.C.L) ఆఫీసుకి వెల్దుల్లోకి, ట్రాఫిక్ బాగా రద్దీగా ఉండటం వల్ల పదకొండున్నర అయ్యింది.
లోపలి వెళ్లి పని ముగించుకుని వచ్చేసాను . గతం తో పోల్చుకుంటే చాలా త్వరగా , ప్రశాంతం గానే ఇన్వాయిస్ సబ్మిషన్ అయిపొయింది అని చెప్పుకోవాలి . అక్కడే కేంటీన్ లో భోజనం చేసి ఇక బయటకు వస్తుండగా నేను గమనించింది ఏంటి అంటే , సెక్యూరిటీ . సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. బయట వరండాలో లెక్కకు మిక్కిలి గా పోలీసులున్నారు.
ఎప్పుడూ లేనిది ఇంతమంది పోలీసులని ఎందుకు పెట్టారో నాకు అర్దంకాలేదు. బయటకు వచ్చిచూస్తే కోర్టు దగ్గర కూడా చాలామంది పోలీసులున్నారు. ఏదో బెదిరింపు కాల్ వచ్చి ఉంటుంది అనుకుని రైల్వే స్టేషన్ వైపు అడుగులు వేసాను.
దారిలో ONGC హెడ్ఆఫీసుకైతే అడుగుకో పోలీసు చొప్పున కాపలా కాస్తున్నాడు. మెల్లగా పోలీసు వ్యాన్ లను ఒక్కోదాని దాటుకుంటూ రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ ని సమీపించాను  .
బ్రిడ్జ్  మెట్లదగ్గర  భారీ  కేడ్లను   అమర్చి అడ్డంగా పోలీసులు నిలబడి దారిని నిరోదిస్తున్నారు. ఎప్పుడూ వాహనాలతో  రద్దీగా  ఉండే రోడ్డు  కేవలం పాద చారులకి మాత్రమె పరిమితమయ్యింది . అసలు ఏమయ్యిందో అర్ధం కాని అయోమయ పరిస్థితి లో ఉన్న నాకు , "FIRE RELIEF CAMP " అని ఒక బోర్డు కనిపించింది . బట్టలు , గోధుమలు , బిస్కట్లు పాలు , ఇలా చాలా రకాల పదార్ధాలతో అలాంటి కేంప్ లు చాలానే కనిపించాయి .
ఇంకో  నాలుగు అడుగులు వేద్దుల్లోకి విషయం అర్ధమయ్యింది . ఎప్పుడూ సందడిగా కలకలలాడుతూ  ఉండే  ఒక కాలనీ( బస్తీ )  అగ్నికి ఆహుతయ్యి బూడిద  గా మారిపోయింది  .



నివురయిపోయిన గుడిసేల్ని  చూస్తూ మరో  రెండు అడుగులు ముందుకేసాను . అగ్ని బాధితుల సహాయార్ధం అని తెచ్చిన బట్టల్ని రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పోగేసారు . 
ఒక్కో బట్టల గుట్ట దగ్గరా లైన్లో నిలబడి ఎవరికీ సరిపోయే సైజు  బట్టల్ని వాళ్ళు ఏరుకుని తీస్కెల్తున్నారు. ముంబయి మెట్రో వాటర్ టేంకర్లకు అమర్చిన తాత్కాలిక కుళాయిల దగ్గర దోసిళ్ళతో పిల్లలు దాహాన్ని తీర్చుకుంటున్నారు. రోడ్డుపై ఒక ముసలవ్వ గుండె పగిలేంతగా ఏడుస్తోంది  అంత దగ్గరగా హృదయ విషాదక సంఘటనలని చూడటం ఇదే తొలిసారి కాదు . కానీ ఈ క్షణం నా కాళ్ళు ముందుకు కదలట్లేదు. చాలా సేపు చుట్టూ చూస్తూ అక్కడే నిలబడిపోయాను .

ఎప్పుడు జరిగింది ? ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు , కానీ అక్కడున్న ఫైర్ మెన్ ని అడిగాను .
శుక్రవారం నైట్ జరిగింది .

తర్వాత ఎం అడగాలో తెలియలేదు .

ఎక్కడినుంచి వచ్చావ్ ? అతను అడిగాడు

కొల్హాపూర్ .

ఇక్కడికి ఎందుకొచ్చావ్ ?
రైల్వేస్టేషన్  లోపలి కి వెళ్ళటానికి


 "లైన్ క్రాసింగ్ బ్రిడ్జ్ కూడా మంటల్లో బాగా కాలి పోయింది .
ఇటువైపు నుంచి లోపలి వెళ్ళటానికి దారిలేదు.

అలా ట్రాక్ దాటుకుని వెళ్ళు అని కొదరు వెళ్తున్న దారిని  చూపించాడు అతను .

  
మసిబారిన బట్టలతో ఒక బాబు ( అయిదారేళ్ళు ఉంటాయి )  నా వెనుకనుంచి మంచి నీళ్ళ బాటిల్ తో  పరిగెత్తుకెళ్ళి  . ఒకామెకు అందించాడు.
రెండ్రోజులుగా ఏడుస్తూనే ఉందనుకుంటా , మొహం మొత్తం ఉబ్బి పోయి ఉంది . నీరసం గా ఏదో లోకం లో ఆలోచిస్తున్నట్లుంది.
ఏడ్చీ ఏడ్చీ ఒంట్లో సత్తువంతా కన్నీలలా కరిగి ,కనులెంట జారిపోయినట్లుంది .
ఆమె మంచి నీటిని తాగగానే, ఈలోకం లోకి వచ్చినదానిమల్లె ,ఆ అబ్బాయిని గుండెలకు హత్తుకుని , రఫీక్ , రఫీక్ అంటూ ఏడవసాగింది. వేరొకామె వచ్చి ఆమెను ఓదార్చటానికి విఫలయత్నం చేస్తోంది.

ఎదురుగా సగం కాలిన ఇంట్లోంచి , కాలిపోయిన బట్టల్ని వస్తువుల్ని బయటకు తీస్తున్న ఓ వృద్దుడు.
ఏం మిగిలుంది ? అని దీనంగా చూసే కుటుంబాలు , సహాయ కేంద్రాలు పంచిన పులిహోర(?) పొట్లాలు , కట్టు బట్టలే మిగిలాయి దేవుడో అంటూ రోదిస్తున్న మహిళల్ని ఎప్పటికప్పుడు కెమెరాల్లో బంధించే మీడియా ,వీరిమద్యనుంచి  నడుస్తూనేను .

ఎన్ని సార్లు ఎంతమంది సర్వే  సర్వే అంటూ వస్తారు అంటూ ఒకకంట ఆక్రోశిస్తూ , మరోకంట దయచేసి మాకు న్యాయం చెయ్యండి అంటూ వచ్చిన అధికారి కాళ్ళమీద పది బతిమాలుతున్న ఒకామెను చూస్తుంటే  చేతులు చెంపల్ని తాకక మానలేదు .



ప్రాంతీయ పత్రికల కధనాల ప్రకారం :


Young India , Young Paper అని స్లోగన్ పెట్టుకున్న ఒక పత్రిక " NBT ( నవ భారత్ టైమ్స్ ) "
In Sunday Edition :

ప్రమాదం  జరిగి ఒక రోజు గడుస్తున్నా ప్రభుత్వం బాదితులగురించి ఏమీ పట్టించుకోవట్లేదు.  నేషనల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ లుగా స్క్రోల్లింగులు రం చెయ్యటానికి తప్ప , ప్రభుత్వం పై ఏ విధమైన ఒత్తిడీ తేలేక పోయింది. బాధితులు సమీప రైల్వే స్టేషన్ ని, సమీప ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జిని  తమ ఆవాసాలుగా మార్చుకున్నారు .  
అగిని కీలలు బాగా ఎగసిపడటం తో రెండు ఫ్లాట్ ఫారం ల మద్య బ్రిడ్జి పూర్తిగా కాలి పోయింది .సుమారు  రెండువేల మంది పైగా నిరాశ్రితులయ్యారు . అగ్నిమాపక సిబ్బందితో కలిసి మొత్తానికి ఇరవై అయిదు మంది  క్షతగాత్రులయ్యారు . టెన్త్ , ఇంటర్  పరీక్షలు రాయాల్సిన విద్యార్ధులు  , హాల్ టికెట్ లు కాలిపోవడం తో ఆవేదన చెందుతున్నారు . దీనిక్కూడా ప్రభుత్వం నుంచి ఏవిధమైన సమాధానమూ లేదు .
"కేవలం మౌనం మాత్రమె సమాధానం కాదని , సంఘటన పై పూర్తి స్తాయి దర్యాప్తు చెయ్యాలని , సంఘటనకి  కారణమయిన  వారిని కఠినం గా శిక్షించాలని , ఈ ప్రమాదానికి  కారణం కేవలం ప్రభుత్వమేనని   , బస్తీని  ఖాళీ  చేయించేందుకే  ప్రభుత్వం ఇళ్ళకు  నిప్పంటించింది   అనే వార్తల్లో  ఎంతవరకూ నిజం ఉందో తేటతెల్లం చెయ్యాల"ని పతిపక్షాలు డిమాండు  చేసాయి  .



మహారాష్ట్ర మణి బిందు  అని స్లోగన్ పెట్టుకున్న ఒక పత్రిక " లోక్  మత్ "
 In Sun Day Edition :


గత  శుక్రవారం  రాత్రి  వంట  గ్యాస్  పేలటం  వల్ల   జరిగిన  అగ్ని ప్రమాదం లో  సుమారు  రెండువేల మది  నిరాశ్రయులయ్యారు . ప్రమాదం జరిగినందుకు  చింతిస్తూ ముఖ్య మంత్రి పృధ్వీ రాజ్ చౌహాన్ , బాధిత కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి ప్రకటించారు . సహాయ చర్యలు యుద్ద ప్రాతిపదికన జరపాలని అధికారులను ఆదేశించారు . ఈ ప్రమాదం లో నష్టపోయిన కుటుంబానికి అయిదు వేలు చొప్పున నష్ట పరిహారం సి.యం. రిలీఫ్ ఫండ్ నుంచి ప్రకటించారు . 
తర్వాత విద్యాశాఖా మంత్రి రాజేంద్ర దర్దా మాట్లాడుతూ ,
"గరీభ్ నగర్ " ప్రాంత విద్యార్డులందరికీ పాఠ్య పుస్తకాలు పునఃపంపిణీ చేయనున్నట్లు , పదవ తరగతి , ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్దుల పరీక్షలకోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు . 
దాతల విశేష స్పందన , విద్యార్దుల , స్వచ్చంద సేవా కార్యకర్తల కృషి ప్రసంసనీయం అని , బాదితులకి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ పడుతుంది అని పునరుద్గాటించారు  .


****************

నాకు ఈ రెండు పత్రికల ధోరణీ చూస్తుంటే మన రాష్ట్రానికి  చెందిన రెండు పత్రికలే కళ్ళముందు కనిపించాయి .


సోమవారం ప్రచురితమైన ఎడిషన్ల లో NBT వాస్తవాన్ని ప్రతిబింబించక పోగా , లోక్ మత మాత్రం పరిస్థితి తీవ్రతను  పలచన చేస్తూ , ప్రభుత్వానికి బాసట గా నిలిచింది.

నిజ పరిస్థితిని వీక్షించి , రెండు పేపర్లను పక్క పక్కనే పెట్టి రీసెర్చ్  చేస్తే గాని నిజా నిజాలు అర్ధం కాక పోతుంటే , వాస్తవాలు ప్రజలకెలా తెలుస్తాయి ?  

 వాస్తవం లోకొస్తే ..

జామా మసీదు , నేషనల్ లైబ్రరీ లకు ఇక్కడినుంచి వెళ్లేవారి రద్దీ విపరీతం గా ఉంటుంది .
MMTS అభివృద్ది బాగా చెందటం తో ఇక్కడి MMTS  రైల్వే స్టేషన్ కి ప్రయానికుల తాకిడి వేలల్లోనే ఉంటుంది.
ఈ ప్రయాణికులపై ఆదారపడి చిన్నా చితకా పనులు చేసుకునే కూలీలు వేల సంఖ్యలో ఇక్కడి బస్తీల్లో నివసిస్తూ ఉంటారు .


బాంద్రా ఈస్ట్ రైల్వే స్టేషన్ పక్కనున్న స్లమ్ పేరు " గరీభ్ నగర్ ", " గరీభ్ వాడ "
 రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం మీద రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు , బయట సమోసా చాయ్ అమ్మేవాళ్ళు , ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర అడుక్కునేవాళ్ళు , రోడ్లు ఊడ్చేవాళ్ళు , ఎలక్షన్ల టైంలో డబ్బులు తీస్కుని సలాం కొట్టే కార్యకర్తలు, మట్టి పని , బండపని , మురుగుపని , కన్స్ట్రక్షన్ పని, సిమెంటు ఇసుకలు మోసే కూలి పని , టైలరింగు పని ,ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పనులకి ఆ బస్తీ ( మురికివాడ , స్లం) నిలయం . సకల కళా పోషకురాలు బాంద్రా.

ఎన్నో వృత్తుల వారిని , ఎన్నో కులాలు , ఎన్నో జాతులు , ఎన్నో మతాల వారిని తనలో కలుపుకున్న బాంద్రా , ఎన్నో ఆటుపోతుల్ని కూడా ఎదుర్కుంది . నేతల రౌడీయిజానికి , వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకోసమే  తరాలుమారినా
బాంద్రా తలరాత మారకపోవటానికి కారణం రాజకీయ పైశాచికత్వం .
దేశం లో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారి శాతం ఇంత తగ్గింది , అంత తగ్గింది ; మురుఇకి వాడలనేవే లేకుండా చేస్తాం పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తాం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు , అంటీ అంటకుండా వ్యవహరించటానికి కారణం కేవలం రాజకీయ లబ్దితప్ప మరేమీ లేదు .

రాజకీయ సంక్షోభం  ఏర్పడే   సమయాల్లో , ప్రభుత్వం పై ఏదైనా విషయంలో తిరుగుబాటు జరిగే సూచనలు ఉన్న సందర్భాలలో మన రాజకీయ నాయకులకి ఇవే పాశుపతాస్త్రాలనేవి
ప్రజలకి ( ముఖ్యం  గా ఆంద్రప్రదేశ్ పజలకి) తెలియనిది కాదు . లోగడ మన రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి , పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం , ఒక పేద వాడపై విరుచుకుపడ్డప్పుడు అదే పార్టీకి చెందిన పీ.జే.ఆర్. తనయుడు విష్ణు వర్ధన రెడ్డి , నాటకీయ ధర్నాలు , సినీ ఫక్కీ అరెస్టులు మనకి తెలియనివి కాదు.


గత మూడు నెలలుగా రాష్ట్రం ( మహా రాష్ట్ర ) లో మారిన ప్రభుత్వ సమీకరణలు , మంత్రివర్గ విస్తరణలు , అసమ్మతి వాదులు , ప్రభుత్వం పై సర్వత్రా వినిపిస్తున్న అవినీతి ఆరోపణలు , వీటినుంచి ప్రజల్ని మభ్యపెట్టటానికి , ప్రభుత్వం కదిపిన పావుగా కొన్ని మీడియా సంస్థలతో పాటు, కొందరు ప్రభుత్వ వ్యతిరేకుల నుంచి విరివిగా వినిపిస్తున్న మాట.
అయితే ప్రతీ ప్రమాదాన్ని ప్రభుత్వఖాతాలో జమ చెయ్యటం , ప్రమాదాల్ని రాజకీయం గా లబ్ది పొండుకోవటానికి ఉపయోదించటం కుటిల రాజకీయ ప్రమాణాలకి నిదర్శనమనేది , ప్రభుత్వ మద్దతు దారుల అభిప్రాయం .


భారత దేశానికి తొలి ఆస్కార్ అందించిన చిత్రం " స్లమ్ డాగ్ మిలియనీర్ " ఈ ప్రాంత నేపధ్యం లోనే జరుగుతుంది . ఆ చిత్రం లో నటించిన  బాలనటి రుబీనా ప్రస్తుతం ఈ అగ్ని  ప్రమాద భాదితురాలేకావటం విశేషం .       
     

సమయం మించి పోతుంది ..
తొమ్మిది గంటలకల్లా కొండుస్కర్ బస్సు స్టాప్ దగ్గర రిపోర్ట్ చెయ్యాలి .

ఈ సారి ముంబై ప్రయాణం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

2 comments:

  1. స్వామి గారు బాగా విశ్లేసించి రాసారు .....
    ఎమి చేస్తాం మన ప్రుబుత్వం అలా వుంది అలాంటప్పుడు
    మీ పరిస్తితులో ఎవరు వున్నా ఎమి చెయ్యలే౦ కోపం
    ఆవేశం వస్తుంది అ సంగటన చూస్తే యిక ఇ టీవీ వాళ్ళు
    ఒకొక్క పార్టి కి ఒకొక్క టీవీ వుంది వాళ్ళని పరిగణం లోకి
    తీసుకోలేం మీరు చెప్పింది నిజమే.....

    ReplyDelete
  2. సుమలతగారు మీరన్నది నిజమేనండి ..

    ఇలాంటి విషయాల్లో మనం మనదేశం లో ఏమీ చెయ్యలేం..
    నాలాగా చేతకాని వ్యవస్థని ప్రభుత్వాలని నిందిస్తూ కూర్చోవటం , ఇంకో అడుగు ముందుకేసి బాధపడటం తప్ప ..
    ఇక ఎప్పటికీ మార్పు చూడలేమేమో ?

    మన మీడియా ధోరనికొస్తే, రక రకాల స్లోగన్ ల తో చలామణీ అవుతాయి .
    "తెలుగు ప్రజల గుండె చప్పుడు ", " ప్రతి అక్షరం ప్రజా పధం","సమ సమాజ స్థాపనే మా లక్ష్యం ".. ఇలా అన్న మాట .
    పాటించలేని స్లోగన్ లు ఎందుకుపెట్టుకుంటారో ఈ మీడియావాళ్ళు నాకు అర్ధం కాదు .
    వార్తలు చూస్తే వీళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో తెలుస్తుంది . అలాకాకుండా "మేము ___ పార్టీ పక్షం " అని పెట్టుకుంటే ఇక ఆ చానెల్ ని చూడాల్సిన అవసరం ఉండదు కదండి .

    ReplyDelete